Menu
Sahasra Namarchana Timings, Details & Ticket Booking Procedure

సహస్రం అంటే ‘1000’ నామాలు అంటే పేర్లు.  1000 పేర్లు చదువుతూ స్వామి వారికి చేసే అర్చన “సహస్ర నామార్చన”.  సహస్ర నామార్చన ను “వెయ్యి నామ ఆరాధన” అని కూడా పిలుస్తారు. తిరుమల లో కూడా వెంకటేశ్వర స్వామికి ఈ అర్చన జరుగుతుంది. 

తిరుమలలో జరిగే ఈ సహస్ర నామార్చన ఆచారంలో వెంకటేశ్వర స్వామి 1000 నామాలను పారాయణం చేయడంతో పాటు పూలతో అలంకరించి, పండ్లు మరియు ఇతర నైవేద్యాలు పెడతారు. ఈ ఆచారం లో పూజారులు సహస్ర నామార్చన ఒకే క్రమంలో జపించటం తో పాటు మృదంగం మరియు ఖంజీర వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తారు.

సహస్ర నామార్చన ప్రాముఖ్యత 

తిరుమల లో జరిగే సహస్ర నామార్చన ఒక ముఖ్యమైన నైవేద్యం. భక్తులకు దీని వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని నమ్మకం.  ఈ నామాలు జపించడం వల్ల భక్తులకు శాంతి, శ్రేయస్సు లభిస్తాయి అని చెప్తారు. అంతే కాక ఈ అర్చనను సమర్పించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి అని చెడు శక్తి (negative vibrations) దూరం అవుతుంది అని నమ్ముతారు. 

సహస్ర నామార్చన ప్రక్రియ 

తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయంలో అర్చకుల బృందం సహస్ర నామార్చనను నిర్వహిస్తుంది. అర్చన ఆచార పద్ధతిలో  పూలు మరియు  అక్షతలను సమర్పించడం తో పాటు వేంకటేశ్వరుని ప్రతి నామాన్ని జపిస్తారు. ఈ సేవకు  45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు సమయం పడుతుంది.  

సహస్ర నామార్చన వివరాలు 

సహస్ర నామార్చన ఉదయం 4:30 గంటలకు మొదలవుతుంది. ఈ అర్చన చేయించుకునే వారు ఉదయం 4:00 గంటలకు  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.  ఈ సేవ కేవలం మంగళ, బుధ, గురు వారాలు జరుగుతుంది. ఈ సేవ టిక్కెట్టు ధర రూ. 220 మరియు ఒక టిక్కెట్టుకు ఒకరికి మాత్రమే అనుమతిస్తారు. ఈ సేవ టిక్కెట్టుకు ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇస్తారు.

సహస్ర నామార్చన టిక్కెట్టు కోట మరియు బుకింగ్ ప్రక్రియ 

ఈ అర్చన సేవ టిక్కెట్లు 60 - 90 రోజుల ముందు విడుదల అవుతాయి. ఈ టిక్కెట్లు ఆన్లైన్ లో అంటే టీటీడీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ లో అంటే తిరుమల లో CRO ఆఫీస్ దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ అర్చన సేవ కు ఆన్లైన్ కోట లో 10 టిక్కెట్లు విడుదల అవుతాయి.  C.R.O ఆఫీస్ దగ్గర భక్తులకు టిక్కెట్లు తరువాత రోజు ఉదయం 8:00 గంటలకు జారీ చేయబడతాయి. 

తిరుమల లో సహస్ర నామార్చన ఎప్పుడు నిర్వహిస్తారు?

ఆలయంలో ఈ ఆచారం సాధారణంగా తెల్లవారుజామున నిర్వహించబడుతుంది. ఈ ఆచారం లో పాల్గొనే భక్తులు ఆచార సమయంలో కఠినమైన ఉపవాసం మరియు నిశ్శబ్దం పాటించాలని భావిస్తారు. అర్చన తర్వాత అర్చకులు భక్తులకు ఆశీర్వాదం స్వామి వారి ప్రసాదం అందిస్తారు.