Menu
Ekantha Seva In Tirumala

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాంత సేవ ప్రతి రోజు జరిగే చివరి సేవ. దీన్ని పానుపు సేవ అని కూడా అంటారు. సర్వ దర్శనం సేవ అవ్వగానే ఈ సేవ ఉంటుంది అందుకే ఇది చివరి సేవ గా పరిగణిస్తారు. ఈ పానుపు సేవ ప్రశాంత వాతావరణంలో శయన మండపంలో జరుపుతారు. వెండితో తయారు చేసిన శ్రీ భోగ శ్రీనివాస మూర్తి ని పానుపు పైన పడుకోబెడతారు. 

తాళ్ళపాక అన్నమాచార్యుల వారసుడు ఈ ఏకాంత సేవ లో లాలి పాటలు ఆలపిస్తారు. ఈ లాలి పాటలు ఆలపించడం ద్వారా స్వామి వారిని నిద్రపుచ్చటమే ఈ సేవ ఉద్దేశం. ఈ పవిత్ర సేవ లో ఒక మధురమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ సేవలో ప్రత్యేక నివేదనగా తరిగొండ వెంగమాంబ హారతి ఇస్తారు. అంటే దశావతారాలు డిజైన్లు ముత్యాలతో చక్కగా అలంకరించి  చేసిన పళ్లెం లో హారతి ఇస్తారు. ఈ నివేదన తరిగొండ వెంగమాంబ యొక్క పవిత్ర భక్తికి నిదర్శనం. 

సంవత్సరం మొత్తంలో 11 నెలలు ఈ పానుపు పైన శయనిస్తారు. భక్తులు పూజలు చేసి స్వామి ఆశీర్వాదాలు అందుకుంటారు. కానీ ధనుర్మాసం ఒక నెల మాత్రం విష్ణు మూర్తి కి ఇష్టమైన అవతారం ఐన శ్రీ కృష్ణుడు బంగారు పానుపు పైన శయనిస్తారు. రోజులు చివరి సేవ కాబట్టి ఇది ఆలయ ఆచారాలు అన్నిటికి ముగింపు అని చెప్పవచ్చు. ఈ ముగింపు సేవ భక్తులకు సంతృప్తి, ప్రశాంతతను కల్పిస్తుంది.  

ఏకాంత సేవ టిక్కెట్టు బుకింగ్ ప్రక్రియ 

ఈ సేవ కు టిక్కెట్టు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు. 

  1. టీటీడీ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి 
  2. మీ లాగిన్ id మరియు పాస్వర్డ్ ను ఇచ్చి ‘login’ బటన్ ని క్లిక్ చేయండి 
  3. తర్వాత “సేవ ఎలక్ట్రానిక్ డిప్” ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి 
  4. అందులో మీ పేరు, వయస్సు, మొబైల్ నెంబర్, మెయిల్ id, ID ప్రూఫ్ నెంబర్ మరియు ID ప్రూఫ్ వంటి వివరాలు ఇవ్వండి 
  5. తర్వాత మీకు కావాల్సిన డేట్ లభ్యత (గ్రీన్ కలర్) ఉందో  లేదో చూసుకుని మీకు కావాల్సిన తేదీ సెలెక్ట్ చేసుకుని ఏకాంత సేవ ను ఎంచుకోండి 
  6. “Submit” బటన్ పైన క్లిక్ చేసి డిప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి 
  7.  లక్కీ డిప్ రిజల్ట్ తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తే పేమెంట్ ని కంప్లీట్ చేసి టికెట్ తీసుకోండి