తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు స్వామి వారి జీవిత భాగస్వామి ఐన పద్మావతి అమ్మవారి దర్శనానికి కూడా తరలి వస్తుంటారు. పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు లో ఉంది. ఈ ఆలయం లో భక్తులు కానుకలు చెల్లిస్తూ ఉంటారు. అలాగే రద్దీ ఎక్కువ అవడం వలన కొంత మంది భక్తులు హుండీ లో తమ కానుకలు చెల్లించ లేకపోవచ్చు.
అలాంటి వారి కోసమే టీటీడీ వారు E-Hundi ని ఏర్పాటు చేశారు. ఈ E - Hundi ద్వారా భక్తులు అమ్మవారి హుండీ లో వేయాలి అనుకున్న కానుకలు అన్ని E-Hundi లో చెల్లించవచ్చు.
అమ్మవారి ఈ హుండీలో కానుకలు సమర్పించడం ఎలా? How To Sponsor Money In Ammavari E-Hundi?
దీని ద్వారా అమ్మవారికి మీరు పంపాలి అనుకున్న కానుకలు అందుతాయి. మీరు మొక్కుకున్నట్టుగా మీకు కావాల్సిన సమయంలో మీరు ఇవ్వాలి అనుకున్న పుట్టినరోజు, మొదటి జీతం వంటి ఏ సందర్భంలో ఐన మీ ఇంటి దగ్గర నుంచే అమ్మవారికి కానుకలు సమర్పించవచ్చు..